అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఘటనలు ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి మేల్కొలుపు వంటివన్నారు. వీటిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని, కేసుల విచారణకు సంగారెడ్డిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ అంశం, అంతర్గత సమస్యలతో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. దాంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. కాంగ్రెస్కు ప్రజలు అధికారమిచ్చింది 2014 వరకేనని గుర్తుంచుకోవాలి. తక్షణం ఆత్మవిమర్శ చేసుకుని అంతర్గత సమస్యలను పరిష్కరించుకుని పాలనపై దృష్టి పెట్టాలి. చాలినన్ని బలగాలు లేకే అల్లర్లను సకాలంలో నియంత్రించలేకపోయామంటూ పోలీసులు తప్పించుకోజూస్తున్నారు. బాధ్యులైన పోలీసు అధికారులను తక్షణం విధులనుంచి తప్పించాలి. విచారణ పేరిట అదుపులోకి తీసుకున్న అమాయకులను విడుదల చేయాలి. బాధితులకు 2009 నాటి కేంద్ర ఉత్తర్వుల మేరకు పరిహారమివ్వాలి’’ అని డిమాండ్ చేశారు.





0 comments:
Post a Comment