దమ్ముంటే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శైలజానాథ్, కొండ్రు మురళిలు రాజీనామా చేసి గెలవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దయతో గెలవలేదు అనుకుంటే తమ సవాల్ ని స్వీకరించాలని ఆమె అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. పిచ్చిమాటలు కట్టిపెట్టి సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్పాలని సలహా ఇచ్చారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారాలపై విచారణ చేస్తే ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ప్రభుత్వ జవాబు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరపున స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ చార్జిషీటులో వైఎస్ పేరును 30 సార్లు ప్రస్తావించినా మంత్రులెందుకు మాట్లాడటంలేదని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టుకు జవాబు చెప్పవలసిన బాధ్యత మంత్రులపై ఉన్నా జగన్ ని ఎందుకు విమర్శిస్తున్నారని ఆమె అడిగారు. రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు.
మానసిక వ్యాధిగ్రస్తుడు రాసిన రాతలు పట్టుకొని మాట్లాడటం మంచిది కాదన్నారు. జగన్ వెంట ఉండే నేతలను విమర్శించే మీరు రోశయ్య గారి కోళ్ల ఫారంలో కోళ్లా, కిరణ్ కుమార్ రెడ్డి గారి కోళ్ల ఫారంలో కోళ్లా లేక సోనియా గాంధీ పౌల్ట్రీలో కోళ్లా చెప్పాలని నిలదీశారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహారాలపై విచారణ చేస్తే ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటారన్నారు. వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై ప్రభుత్వ జవాబు ఏమిటని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరపున స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ చార్జిషీటులో వైఎస్ పేరును 30 సార్లు ప్రస్తావించినా మంత్రులెందుకు మాట్లాడటంలేదని ఆమె ప్రశ్నించారు. సుప్రీం కోర్టుకు జవాబు చెప్పవలసిన బాధ్యత మంత్రులపై ఉన్నా జగన్ ని ఎందుకు విమర్శిస్తున్నారని ఆమె అడిగారు. రెండు నాల్కల ధోరణితో మాట్లాడటం మానుకోవాలని సలహా ఇచ్చారు.
మానసిక వ్యాధిగ్రస్తుడు రాసిన రాతలు పట్టుకొని మాట్లాడటం మంచిది కాదన్నారు. జగన్ వెంట ఉండే నేతలను విమర్శించే మీరు రోశయ్య గారి కోళ్ల ఫారంలో కోళ్లా, కిరణ్ కుమార్ రెడ్డి గారి కోళ్ల ఫారంలో కోళ్లా లేక సోనియా గాంధీ పౌల్ట్రీలో కోళ్లా చెప్పాలని నిలదీశారు.
0 comments:
Post a Comment