జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని - డీఎల్ రవీంద్రరెడ్డి

వచ్చే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రరెడ్డి అన్నారు. రాయలసీమలో కాంగ్రెస్ కు మూడో స్థానమేనని ఆయన పేర్కొన్నారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరుగుతున్నానని, అధిష్టాన ఆదేశానుసారం రాజీనామా లేఖ సమర్పిస్తానని డీఎల్ అన్నారు.

2014 వరకూ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తమిళనాడు పరిస్థితే నెలకొంటుందని డీఎల్ వ్యాఖ్యానించారు. జగన్ ను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు. జగన్ కు ఒకసారి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని సర్వేలు చెబుతున్నాయన్నారు. జగన్ కు సరైన సలహాదారు లేకపోవటమే రాజకీయంగా ఆయనకు లోటు అని డీఎల్ అన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More