'బాబూ.. ఢిల్లీ పర్యటన గుట్టు బయటపెట్టు'

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనడానికి ఆయన ఢిల్లీ పర్యటనే నిదర్శమని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. విద్యుత్ ధర్నాలో ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించకపోవడం, ఆగమేఘాల మీద హస్తినకు బయలుదేరడం దేనికి సంకేతమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత జూపూడి ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ మిమ్మల్ని కూడా పిలిచిందా అంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఎవరెవరినీ కలిశారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హఠాత్తుగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. 

ఏసీబీ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఎవరో తనకు తెలియదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను జూపూడి తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యల ద్వారా సత్తిబాబు తన అవివేకాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తి రేపు వైఎస్సార్ ఎవరని అడిగినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. రాష్ర్టంలో పాలన అస్థవ్యస్తంగా తయారయిందని జూపూడి ఆరోపించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More