మాజీ ఎంపీ గిరజాల వెంకట స్వామినాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పర్యటిస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వెంకట స్వామినాయుడికి కండువా వేసి జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై జగన్ చేస్తున్న పోరాటమే తనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేలా చేసిందని ఈ సందర్భంగా వెంకట స్వామినాయుడు అన్నారు. "బెంజి తెల్సూ.. గంజీ తెల్సని".. చిరంజీవి మోసం చేశారన్నారు.
0 comments:
Post a Comment