పేదోడి చదువు గోడు పట్టని ప్రభుత్వంపై పోరు మొదలుపెట్టిన యువనేత జగన్కు మద్దతుగా విద్యార్థిలోకం తరలివచ్చింది. వారితోపాటే తల్లిదండ్రులూ పోటెత్తారు. సర్కారు ఫీజు కట్టకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మిలా మరో విద్యార్థి బతుకు బలికాకూడదంటూ నినదించిన జగన్కు జేజేలు పలికారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలంటూ జగన్ శుక్రవారం ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నా చౌక్లో ‘ఫీజు పోరు’ పేరిట ప్రారంభించిన వారం రోజుల నిరాహార దీక్షకు విద్యార్థిలోకం భారీగా తరలి వచ్చింది. వేలాది మంది విద్యార్థులు దీక్షా స్థలికి చేరుకొని.. యువనేత రాక కోసం ఎదురు చూశారు.
ఉదయం 11.45 ప్రాంతంలో జగన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు.. ఆయన్ను చూడటానికి విద్యార్థులు పోటీ పడ్డారు. నియంత్రించడం భద్రతా సిబ్బంది, వాలంటీర్లకు సాధ్యం కాలేదు. సర్కారు ఫీజు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరో కుటుంబానికి తమ దుస్థితి రాకూడదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ దీక్షను వరలక్ష్మికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన యువనేత దీక్షా స్థలికి ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’గా పేరు పెట్టారు.
మాతృమూర్తి ఆశీస్సులు తీసుకొని: యువనేత ఉదయం 10.45 గంటలకు తన నివాసంలో తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఫీజు పోరుకు బయలుదేరారు. ఆయన వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తదితరులున్నారు. ఇంటి నుంచి పంజగుట్టకు చేరుకున్న యువనేతకు మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మహానేత వైఎస్ విగ్రహానికి జగన్ నిలువెత్తు పూలమాలవేసి నివాళులర్పించారు. అభిమానులు జి. రత్నమణి, తోట్ల సునీత, ప్రగతిరెడ్డి యువనేతకు హారతిపట్టి తిలకందిద్దారు. తర్వాత ఆయన ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాపార్క్కు వెళ్లారు.
విద్యార్థుల్లో సమరోత్సాహం
ఫీజులు చెల్లించలేక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. ప్రమాదవశాత్తూ మరణించిందని ప్రభుత్వం చిత్రీకరించడానికి ప్రయత్నించిందని యువనేత చెప్పినప్పుడు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పేదోడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. ‘లేదు.. లేదు’ అని తీవ్రస్థాయి స్పందన వచ్చింది.
సర్కారు కూలిపోతుంది: ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఓయూ విద్యార్థులు రమేష్ యాదవ్, రామకోటి, రాజశేఖర్రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతశ్రీ కళాశాలకు చెందిన రాజేశ్వర్, వరంగల్ జిల్లా జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి కళాశాల విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించుకోలేని తమ దుస్థితిని వివరించారు.
వైఎస్ పేరును ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు పెట్టాలని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ రాకేష్ డిమాండు చేశారు. తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున ఫీజు పోరుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అజయ్ తెలిపారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చిన రంగారెడ్డి, ట్రైబల్ డెవలెప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాం నాయక్.. రీయింబర్స్మెంట్కు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న పాట్లను వివరించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బీరవోలు సోమన్న కళాబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఒంటెల ప్రదర్శన ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యువనేత వెంట శాప్ మాజీ చైర్మన్ రాజ్సింగ్ ఠాకూర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, గ్రేటర్ హైదరాబాద్ యువనాయకులు పుత్తా ప్రతాప్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే సోదరుడు గడికోట సుదీప్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులున్నారు.
దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఎంపీ: మేకపాటి రాజమోహన్రెడ్డి.
ఎమ్మెల్యేలు: బాలినేని శ్రీనివాస రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్రెడ్డి, జయసుధ, కాటసాని రాంరెడ్డి, కమలమ్మ, అమరనాథ్రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, బాబూరావు, రామకృష్ణారెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొర్ల భారతి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డి.
ఎమ్మెల్సీలు: పుల్లా పద్మావతి, కొండా మురళి, జూపూడి ప్రభాకరరావు, టీజీవీ కృష్ణారెడ్డి.
ఈ దుస్థితి మరే కుటుంబానికీ వద్దు
‘ఫీజు పోరు’లో పాల్గొన్న వరలక్ష్మి సోదరుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు చెల్లించలేకపోవడంతో తన చెల్లి మరణించిందని, మరే కుటుంబానికీ ఈ దుస్థితి రాకూడదని అన్నారు. ‘పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. పేదవాళ్ల చదువుల కోసం ఆయన గొప్ప ఆశయంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో నా చెల్లెలు వరలక్ష్మి తనువు చాలించింది. మరే కుటుంబానికి ఇలాంటి దుస్థితి రావొద్దు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
ఉదయం 11.45 ప్రాంతంలో జగన్ వేదిక వద్దకు వచ్చినప్పుడు.. ఆయన్ను చూడటానికి విద్యార్థులు పోటీ పడ్డారు. నియంత్రించడం భద్రతా సిబ్బంది, వాలంటీర్లకు సాధ్యం కాలేదు. సర్కారు ఫీజు చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న వరలక్ష్మి తల్లిదండ్రులు, సోదరుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరో కుటుంబానికి తమ దుస్థితి రాకూడదంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ దీక్షను వరలక్ష్మికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన యువనేత దీక్షా స్థలికి ‘వరలక్ష్మి దీక్షా ప్రాంగణం’గా పేరు పెట్టారు.
మాతృమూర్తి ఆశీస్సులు తీసుకొని: యువనేత ఉదయం 10.45 గంటలకు తన నివాసంలో తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఫీజు పోరుకు బయలుదేరారు. ఆయన వెంట ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు తదితరులున్నారు. ఇంటి నుంచి పంజగుట్టకు చేరుకున్న యువనేతకు మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ ఆధ్వర్యంలో పలువురు ముస్లింలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ మహానేత వైఎస్ విగ్రహానికి జగన్ నిలువెత్తు పూలమాలవేసి నివాళులర్పించారు. అభిమానులు జి. రత్నమణి, తోట్ల సునీత, ప్రగతిరెడ్డి యువనేతకు హారతిపట్టి తిలకందిద్దారు. తర్వాత ఆయన ట్యాంక్బండ్పై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాపార్క్కు వెళ్లారు.
విద్యార్థుల్లో సమరోత్సాహం
ఫీజులు చెల్లించలేక వరలక్ష్మి ఆత్మహత్య చేసుకొంటే.. ప్రమాదవశాత్తూ మరణించిందని ప్రభుత్వం చిత్రీకరించడానికి ప్రయత్నించిందని యువనేత చెప్పినప్పుడు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పేదోడి ముఖంలో చిరునవ్వు చూడలేని ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా? అని జగన్ ప్రశ్నించినప్పుడు.. ‘లేదు.. లేదు’ అని తీవ్రస్థాయి స్పందన వచ్చింది.
సర్కారు కూలిపోతుంది: ఫీజులు చెల్లించకపోతే ప్రభుత్వం కుప్పకూలి పోతుందని ఓయూ విద్యార్థులు రమేష్ యాదవ్, రామకోటి, రాజశేఖర్రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతశ్రీ కళాశాలకు చెందిన రాజేశ్వర్, వరంగల్ జిల్లా జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి కళాశాల విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. ఫీజులు చెల్లించుకోలేని తమ దుస్థితిని వివరించారు.
వైఎస్ పేరును ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు పెట్టాలని జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధి డాక్టర్ రాకేష్ డిమాండు చేశారు. తెలంగాణ యూత్ ఫోర్స్ తరఫున ఫీజు పోరుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు అజయ్ తెలిపారు. ఎస్కే యూనివర్సిటీ నుంచి వచ్చిన రంగారెడ్డి, ట్రైబల్ డెవలెప్మెంట్ అసోసియేషన్ కార్యదర్శి పరశురాం నాయక్.. రీయింబర్స్మెంట్కు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పడుతున్న పాట్లను వివరించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన బీరవోలు సోమన్న కళాబృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఒంటెల ప్రదర్శన ప్రత్యేక ఆక ర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో యువనేత వెంట శాప్ మాజీ చైర్మన్ రాజ్సింగ్ ఠాకూర్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గట్టు రామచంద్రరావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అమృతాసాగర్, గ్రేటర్ హైదరాబాద్ యువనాయకులు పుత్తా ప్రతాప్రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే సోదరుడు గడికోట సుదీప్రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులున్నారు.
దీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఎంపీ: మేకపాటి రాజమోహన్రెడ్డి.
ఎమ్మెల్యేలు: బాలినేని శ్రీనివాస రెడ్డి, సుభాష్ చంద్రబోస్, ప్రసన్నకుమార్రెడ్డి, జయసుధ, కాటసాని రాంరెడ్డి, కమలమ్మ, అమరనాథ్రెడ్డి, బాలనాగిరెడ్డి, శ్రీనివాసులు, బాబూరావు, రామకృష్ణారెడ్డి, కొండా సురేఖ, శ్రీకాంత్రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కొర్ల భారతి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శోభానాగిరెడ్డి, గుర్నాథరెడ్డి.
ఎమ్మెల్సీలు: పుల్లా పద్మావతి, కొండా మురళి, జూపూడి ప్రభాకరరావు, టీజీవీ కృష్ణారెడ్డి.
ఈ దుస్థితి మరే కుటుంబానికీ వద్దు
‘ఫీజు పోరు’లో పాల్గొన్న వరలక్ష్మి సోదరుడు మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు చెల్లించలేకపోవడంతో తన చెల్లి మరణించిందని, మరే కుటుంబానికీ ఈ దుస్థితి రాకూడదని అన్నారు. ‘పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత వైఎస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలను ప్రభుత్వం నీరుగారుస్తోంది. పేదవాళ్ల చదువుల కోసం ఆయన గొప్ప ఆశయంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో నా చెల్లెలు వరలక్ష్మి తనువు చాలించింది. మరే కుటుంబానికి ఇలాంటి దుస్థితి రావొద్దు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.