వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం నియోజకవర్గం పర్యటనSchedule

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నరసాపురం నియోజకవర్గం పర్యటన ను విజయవంతం చేయాలని పార్టీ వర్గాలకు పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్ రాజు పిలుపు నిచ్చారు. ఏలూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర ముగించుకుని ఆదివారం సాయంత్రం బయలుదేరి విజయవాడ, హనుమాన్‌జంక్షన్, ఏలూరు, తణుకు, మార్టేరు మీదుగా రాత్రికి నరసాపురం చేరుకుంటారని తెలి పారు. 

2, 3, 4 తేదీల్లో నరసాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని చెప్పారు. ఆదివారం సాయంత్రం హనుమాన్ జంక్ష న్ వద్దకు పెద్ద ఎత్తున పార్టీ నే తలు, కార్యకర్తలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలకాలన్నారు. 2న మొగల్తూరు మండలం, 3, 4న నరసాపురం మండలంలో పర్యటిస్తారు. 4 సాయంత్రం నరసాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తెలిపారు. పోలవరం నియోజకవర్గంలో ఈ నెల 13, 14, 15, 16 తేదీల్లో జగన్ పర్యటిస్తారని చెప్పారు. 

ఇతర పార్టీల నేతల చేరికతో పెరగనున్న బలం 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పలువురు నేతలు చేరటంతో పార్టీకి మరింత బలం చేకూరనుందని కొయ్యే మోషేన్‌రాజు తెలిపారు. చిరంజీవి కాపులను మాయచేసి స్వార్ధపూరిత రాజకీయాలకు వాడుకున్నారని గ్రహించిన పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తు న్నారని చె ప్పారు. 2న మాజీ ఎంపీ హరిరామజోగయ్య, తాడేపల్లిగూడెంకు చెందిన తోట గోపి జగన్ సమక్షంలో పార్టీలో చేరతారన్నారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More