హైదరాబాద్: విద్యుత్ చార్జీలు పెంపునకు నిరసనగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ ఛీప్ విప్ గండ్ర వెంకట రమణ అన్నారు.అధికారం కోసం చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ లో సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. డిసిసి అధ్యక్షుల ఎంపిక విషయం చర్చించడానికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అధిష్టానం ఢిల్లీకి పిలిపించినట్లు చెప్పారు.





0 comments:
Post a Comment