2014లో జగన్‌దే భవిష్యత్తు: శంకర్రావు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి వ్యక్తి అని, ఆయనకు మంచి రోజులు వచ్చాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు అన్నారు. 2014లో జగన్‌మోహన్‌రెడ్డికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. శుక్రవారం ఉగాది సంబరాలలో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బాపూజీనగర్‌కు వచ్చిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో కీలక వ్యక్తులుగా కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, శంకర్రావులే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో సీఎం కిరణ్ భవితవ్యమేమిటని విలేకరులు ప్రశ్నించగా.. భగవంతుడు కరుణిస్తే తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన సమాధానమిచ్చారు. జగన్‌ను సీఎంను చేయాలని సంతకాలు పెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాడని, అలాంటి ఆయనకు జగన్ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని చెప్పారు. 

కాంగ్రెస్ అధిష్టానాన్ని కిరణ్ మోసగించి సీఎం పదవిలో కూర్చున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి, మంత్రిమండలి కూడా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు తప్పుడు జీవోలు విడుదల చేయడం వల్లనే కోర్టులో కేసు వేశానని, ఆయన జైలుకు పోవడం ఖాయమని శంకర్రావు అన్నారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More