కోవూరులో ప్రభంజనమే: కొణతాల

హైదరాబాద్: కోవూరు ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించనుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహార సమన్వయ కర్త కొణతాల రామకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేసి, జగన్‌ను బలపర్చాలని ప్రజలు నిశ్చయించుకున్నారన్నారు. కాంగ్రెస్-టీడీపీలు కుమ్మక్కై అధికార యంత్రాన్ని ఉపయోగించుకొని ఎన్నికుట్రలు, కుతంత్రాలు చేసినా, ఆ రెండు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ది చెప్పనున్నారని తెలిపారు. వైఎస్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి రావాలంటే అధికారంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ రావాలని మెజార్టీ ప్రజలు కోరుతున్నారని కొణతాల చెప్పారు. 

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More