దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న జగన్

వైఎస్సార్ సీపీ నాయకుల ఉద్ఘాటన
చిత్తూరు జిల్లా నేతలకు అవగాహన సదస్సు

తిరుపతి, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ రాజకీయాలనే మలుపు తిప్పే రోజు వస్తుందని, కేంద్రంలో కూడా తమ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయని పార్టీ రాష్ట్ర నాయకులు ఉద్ఘాటించారు. చిత్తూరు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోమవారం తలకోనలో రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించింది. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం తరలి వచ్చింది. సదస్సుకు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అధ్యక్షత వహించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీలు రెహ్మాన్, జూపూడి ప్రభాకరరావు, ఎన్‌టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావు, కిరణ్‌కుమార్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశరావు, జనక్ ప్రసాద్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వంగపండు ఉష, డాక్టర్ ఎం.హరికృష్ణారెడ్డి, చల్లా మధుసూదన్, సీనియర్ జర్నలిస్టు ప్రసాదరెడ్డి, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More