గంగవరం విశ్వేశ్వరాలయంలో జగన్ పూజలు

రామచంద్రాపురం : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. ఆయన తన పర్యటనను గంగవరం నుంచి ఆరంభించారు. స్థానిక విశ్వేశ్వరాలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జగన్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
జగన్ ఉదయం కె.గంగవరంలో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
* అనంతరం కూనిమిల్లిపాడు, యర్రపోతవరం, బాలాంత్రంలలో దివంగత మహానేత వైఎస్ విగ్రహాల్ని ఆవిష్కరిస్తారు.
* తర్వాత పేకేరు, తాళ్లపూడి, భట్లపాలికలలో పర్యటిస్తారు.
* అనంతరం మసకపల్లి, కోలంకల్లో వైఎస్ విగ్రహాల్ని ఆవిష్కరిస్తారు.
* కుయ్యేరు, దుగ్గుదూరు, కాజులూరు, చేదువాడ గొల్లపాలెంలో పర్యటించిన అనంతరం కాకినాడ-కోటిపల్లి రోడ్లో ఆర్యవటం మీదుగా ఉండూరు చేరుకోవడంతో రెండవ రోజు పర్యటన ముగుస్తుంది.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More