పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్

నెల్లూరు జిల్లా కోవూరులో ఎన్నికల ప్రచారం ముగించుకుని శుక్రవారం రాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
నేడు జగన్ పర్యటన వివరాలు

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శనివారం ఉదయం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకం కానున్నారు. 11 గంటలవరకు కార్యాలయంలోనే ఉండి స్థానిక అర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగే యూసీఐఎల్ గ్రీవెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో వేంపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన మహానేత, దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More