గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అంకిరెడ్డిపాలెం ప్రజలు ఆత్మీయనేతకు అపూర్వ స్వాగతం పలికారు. అభిమానుల ప్రేమాభిమానాల మధ్య ముందుకు కదిలిన జగన్ అక్కడ ఓ బస్ షెల్టర్ ను ప్రారంభించారు. ఆ పల్లెలో ఓ చిన్నారికి విజయమ్మ అని నామకరణం చేశారు. తనను ఆశీర్వదించేందుకు వచ్చిన ప్రజలకు ఆయన సవినయంగా నమస్కరిస్తూ ముందుకు కదిలారు.
0 comments:
Post a Comment