ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు:
హైదరాబాద్,
న్యూస్లైన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా
సంక్షేమాన్ని, ప్రాధాన్యత రంగాలను పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి రావడానికి వైఎస్ నాయకత్వంలో ఇచ్చిన హామీలను కిరణ్ ప్రభుత్వం
తుంగలో తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ
సమన్వయకర్త కొణతాల రామకృష్ణ దుయ్యబట్టారు. లక్షా యాభై వేల కోట్ల బడ్జెట్
అని గొప్పగా చెప్పుకోవడానికి తప్పితే పేదలకు కించిత్ లాభంలేదని
ధ్వజమెత్తారు. ఇద్దరు మంత్రులు చదివి వినిపించడం తప్ప ఈ బడ్జెట్లో
కొత్తదనమేదీ లేదని ఎద్దేవా చేశారు. పార్టీ నేతలు హెచ్.ఎ.రెహమాన్, గట్టు
రామచంద్రరావులతో కలిసి పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల
సమావేశంలో మాట్లాడారు.
‘‘బడ్జెట్లో వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు’’ అని కొణతాల చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్తు కోత విధించిన ఘనత సీఎం కిరణ్కే దక్కుతుంది. రైతులు పండించే ధాన్యానికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అందిస్తామని కిరణ్తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు.
కానీ వాటిని బడ్జెట్లో మాటమాత్రంగా కూడా చెప్పలేకపోయారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. రైతుకు ఊరటనిచ్చే అంశాలను ఒక్కటీ చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించడంలేదు. దీనివల్ల విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయి. ఈ పథకానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవగా కేవలం రూ.4 వేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వం, పేదలకిచ్చే పెన్షన్ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో నెలకు రూ.75 ఉండగా, వైఎస్ దానిని రూ.200కు పెంచారు. ఈ ప్రభుత్వం పెన్షన్ను కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వాళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ ఆయన విచక్షణ పరిధి కింద రూ.600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీనివల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని నిలదీశారు.
మైనారిటీలను విస్మరించిన బడ్జెట్: రెహమాన్
రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహా నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేని లోటు ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం సంక్షేమానికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించేవారన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1 శాతం నిధులు కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
![](http://www.sakshi.com/newsimages/contentimages/18022012/konaatala18-2-12-13750.jpg)
‘‘బడ్జెట్లో వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం సహా అన్ని రంగాలకు నిరాశే మిగిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్న హామీని బడ్జెట్లో ప్రస్తావించకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే సబ్సిడీ బియ్యం 20 నుంచి 30 కేజీల పెంపు విషయాన్ని కూడా ప్రస్తావించలేదు’’ అని కొణతాల చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూ లేనివిధంగా నవంబర్-డిసెంబర్ నెలల్లో విద్యుత్తు కోత విధించిన ఘనత సీఎం కిరణ్కే దక్కుతుంది. రైతులు పండించే ధాన్యానికి కేంద్రం మద్దతు ధర ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి అందిస్తామని కిరణ్తోపాటు పీసీసీ చీఫ్ బొత్స గొప్పగా ప్రకటించారు.
కానీ వాటిని బడ్జెట్లో మాటమాత్రంగా కూడా చెప్పలేకపోయారు. రైతుల నడ్డి విరిచే విధంగా ఎరువుల ధరలు విపరీతంగా పెంచారు. రైతుకు ఊరటనిచ్చే అంశాలను ఒక్కటీ చేర్చలేకపోయారు. కౌలు రైతులకు పావలా వడ్డీకే రుణాలని చెప్పారు. వాస్తవ పరిస్థితి చూస్తే వారికి ఇప్పటిదాకా గుర్తింపు కార్డులు ఇవ్వలేకపోయారు. ఖజానా నింపుకోవడానికి మాత్రం అడ్డగోలుగా పన్నులు పెంచారు’’ అని దుయ్యబట్టారు. ‘‘వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తేసే కుట్రలో భాగంగా ఈ పథకానికి సరిపడా నిధులు కేటాయించడంలేదు. దీనివల్ల విద్యార్థుల చదువులు గాల్లో దీపంలా తయారయ్యాయి. ఈ పథకానికి దాదాపు రూ.8 వేల కోట్లు అవసరమవగా కేవలం రూ.4 వేల కోట్లే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పేదల పాలిట అపర సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా విస్మరించారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు మూడు, నాలుగు రెట్లు పెంచిన కిరణ్ ప్రభుత్వం, పేదలకిచ్చే పెన్షన్ను పెంచాలనే ఆలోచన చేయకపోవడం దురదృష్టకరం. పేదలకిచ్చే పెన్షన్ చంద్రబాబు హయాంలో నెలకు రూ.75 ఉండగా, వైఎస్ దానిని రూ.200కు పెంచారు. ఈ ప్రభుత్వం పెన్షన్ను కనీసం యాభై నుంచి వంద రూపాయలకు పెంచే ఆలోచన చేయలేదు. వాళ్ల జీతాలు మాత్రం విపరీతంగా పెంచేసుకున్నారు. సీఎం కిరణ్ ఆయన విచక్షణ పరిధి కింద రూ.600 కోట్లు పెంచుకోవడం సిగ్గుచేటు. దీనివల్ల పేదలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’’ అని నిలదీశారు.
మైనారిటీలను విస్మరించిన బడ్జెట్: రెహమాన్
రాష్ట్ర బడ్జెట్లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహా నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లేని లోటు ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం సంక్షేమానికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించేవారన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1 శాతం నిధులు కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
0 comments:
Post a Comment