
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లిం మైనారిటీలకు తీవ్ర
అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్
కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ దుయ్యబట్టారు. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి లోటు
ముస్లింలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. వైఎస్ ఉండి ఉంటే ముస్లిం
సంక్షేమానికి బడ్జెట్లో వెయ్యి కోట్లు కోట్లు కేటాయించేవారన్నారు. కిరణ్
ప్రభుత్వం మైనారిటీ శాఖకు ఏదో కొంత విదిల్చి తామెంతో చేశామని చెప్పుకోవడం
సిగ్గుచేటన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న జనాభాకు కేవలం 0.1శాతం
నిధుల కేటాయించడం ఏ విధంగా సమర్థనీయమని రెహమాన్ నిలదీశారు.
Do you Like this Artical..?
|
Get Free Email Updates Daily!
|
Follow us!
|
0 comments:
Post a Comment