వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహాపాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తిరిగి ఆయన తన యాత్రని ఈ నెల 21 నుంచి మొదలుపెడతారు. పార్టీ అధినేత జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు కోటంరెడ్డి కృష్ణా జిల్లా మునిసిపల్ ఎన్నికలకు పరిశీలకునిగా వెళుతున్నారు. పార్టీ తరపున కృష్ణా జిల్లా ఎన్నికల పరిశీలకునిగా కోటంరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఉరితీసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై ఎల్లోమీడియా తప్పుడు రాతలు రాస్తోందన్నారు.
0 comments:
Post a Comment