ఈ నెల 10, 11, 12 తేదీలలో 48 గంటల రైతు దీక్ష

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి 48 గంటల రైతు దీక్ష చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన చెప్పారు.ఈ నెల 10, 11, 12 తేదీలలో ఈ దీక్ష చేయనున్నట్లు తెలిపారు. 10వ తేదీ ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభించి 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని ఆయన వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నేతల సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దీక్షలో తెలంగాణ ప్రాంత రైతులు అధికంగా పాల్గొంటారని తెలిపారు. 

తెలంగాణలో రైతు బతుకు అధ్వాన్నంగా ఉందని ఆయన అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మహారాష్ట్రలో పత్తి ధరలు పడిపోతే, అక్కడ రైతులు కూడా ఆదిలాబాద్ కు వచ్చి అమ్ముకున్నారని తెలిపారు. అప్పుడు ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లభించేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నారన్నారు. నేడు పసుపు ధర మూడు వంతులు తగ్గిపోయిందన్నారు. రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడిందన్నారు. 

రైతు దీక్ష ఏర్పాట్లను చూసేందుకు ఒక స్టీరింగ్ కమిటీని నియమించినట్లు ఆయన తెలిపారు. ఈ కమిటీలో ఎమ్మెల్సీ కొండా మురళీ, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బోడ జనార్దన్ తోపాటు మదన్ లాల్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, గుత్తా ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రవణ్ రెడ్డి ఉంటారని ఆయన వివరించారు.

Do you Like this Artical..?

Get Free Email Updates Daily!

Follow us!

Related Posts Plugin for WordPress, Blogger...
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More